జనసేన-తెలుగుదేశం పొత్తు గెలవాలి

పిఠాపురం, జనసేన నాయకులు జనసేన-తెలుగుదేశం పొత్తు గెలవాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. సొంత ఇల్లు కల నెరవేరని ప్రజలు పట్టాలు ఇచ్చారుగాని ఇళ్ల స్థలాలు చూపించలేదని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారని, జనసేన-తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మీ సమస్య మా సమస్య అంటున్న జనసేన నాయకులు ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు జనసేన నాయకులు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టైల్స్ బాబీ, మారౌతు సూరిబాబు, మల్లం బీసీ నాయకులు శ్రీనివాసరావు మరియు పుణ్యమంతుల సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.