తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ రేపు తుఫాన్ ప్రభావిత ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. రేపు ఢిల్లీలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న ప్రధాని ముందుగా భువనేశ్వర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో సమావేశమై ఒడిశాలో తుఫాన్ పరిస్థితిపై సమీక్షించనున్నారు. అనంతరం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన బాలాసోర్‌, భద్రక్‌, పర్బ మేదినిపూర్‌లలో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కూడా తుఫాన్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు.