కులాల మధ్య చిచ్చుపెట్టి.. అల్లర్లు సృష్టించిన ఘనత వైసీపీదే: కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ నివాసంలో గురువారం జరిగిన పాత్రికేయ సమావేశంలో దుర్గేష్ మాట్లాడుతూ.. వైస్సార్సీపీ పార్టీ కుట్ర పూరితంగా.. కులాల మధ్య చిచ్చుపెట్టి అమలాపురంలో అల్లర్లు సృష్టించిన ఘటనపై.. దళిత యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సంఘటనలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలపై వైస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ.. వైస్సార్సీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయ యాత్రను “సామాజిక అన్యాయ యాత్ర”గా పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా.. సీబీఐ దత్తపుత్రుడు కి జనసేన సవాల్..! అంటూ టీమ్ పిడికిలి వారు రూపొందించిన గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, నియోజకవర్గ ఇంచార్జ్ లు శెట్టిబత్తుల రాజబాబు, మేడా గురుదత్ ప్రసాద్, అనుశ్రీ సత్యనారాయణ, మర్రెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర వీరమహిళా సెక్రటరీ శ్రీమతి ప్రియా సౌజన్య, రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.