కాపులు, జనసైనికుల పోరాటం సఫలం

తూర్పుగోదావరి జిల్లా, పి గన్నవరంలో, విధులలో ఉన్న ఎస్సై సురేంద్ర చేసిన అతి ఘోరమైన తప్పిదానికి తిరుపతి జనసేన నాయకులు చింతకాయల కృష్ణయ్య మాట్లాడుతూ… “కాపులు, జనసైనికులు పోరాడిన ఫలితమే ఆయనను వేకెన్సీ రిజర్వ్ పంపే ప్రయత్నం సఫలం సఫలమైనదిగా మనము భావించి సంతోషించాలి. అందుకే కాపులు బలిజ ఒంటరి తెగలు, ఏ వ్యవస్థ, ఏ వర్గమైనా మన కులస్తుల పై అక్రమంగా దాడి చేసి, కేసులు పెడితే మనమందరము ఐక్యతతో పోరాడితే, ఇలాంటి ఫలితాలే వస్తాయి అనేది మరొక నిదర్శనం. ఈ విషయంలో తిరుపతి నుంచి నేను, ఎక్కువగా స్పందించి, ఎస్పి డిఎస్పి లతో మాట్లాడి, మన వాళ్లందర్నీ సంఘటితపరచి, పోరాడే విధంగా నా ప్రయత్నం జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే మనము చీమలదండు గాని, ఏనుగుల గుంపులుగానీ మనము ఉదాహరణగా తీసుకొని మనం ప్రతిఘటించాలని నేను మిమ్మల్ని అందరిని కోరుచున్నాం” అని అన్నారు.