అందరం దేశానికి సేవ చేసే టైమొచ్చింది: వెంకటేశ్

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సందేశం అందించారు. మనం అందరం దేశానికి సేవ చేసే టైమొచ్చిందని అన్నారు. మనం ఏమీ చేయలేం అనుకోవద్దని, రోజురోజుకు పెరగాల్సింది భయం కాదని, బాధ్యత అని పిలుపునిచ్చారు. అందరం ఒకరికి ఒకరం దూరంగా ఉంటూ, బయటికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుందామని అన్నారు.

కరోనా బారి నుంచి మనదేశాన్ని మనమే రక్షించుకుందాం అని దృఢసంకల్పం వెలిబుచ్చారు. ఈ మేరకు వెంకటేశ్ సందేశంతో కూడిన వీడియోను ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్యాంధ్ర విభాగం సోషల్ మీడియాలో పంచుకుంది.