సచివాలయ ఉద్యోగి ఆకుల అశోక్ పై వైసీపీ నాయకుడి దాడి హేయమైన చర్య

  • జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్

గురజాల: పిడుగురాళ్ల పట్టణంలో 29వ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి సచివాలయ శానిటైజర్ సెక్రెటరీ ఆకుల అశోక్ పై అదే వార్డుకు చెందిన వైసిపి నాయకులు సైదా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు చాలా దుర్మార్గమని, ఉద్యోగస్తులు మీదనే.. ఈ విధంగా దాడులకు పాల్పడితే ఇక సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు, వెంటనే అతని పై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, అదేవిధంగా గురజాల నియోజవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు వెంటనే దీని గురించి స్పందించి అతని శాశ్వతంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని రానున్న రోజుల్లో ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేశారు.