సర్వేపల్లిలో జనంకోసం జనసేన మూడవరోజు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగముడి పంచాయతీలో 3వ రోజైన గురువారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొనసాగించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయితే ఇప్పటివరకు 8 సార్లు కరెంటు బిల్లుల పెంపకం ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో పెంచి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపారు. ఇంటింటికి జగనన్న స్టిక్కర్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వీళ్లు ప్రవేశపెట్టిన కార్యక్రమానికి అయ్యే ఖర్చుని ప్రజాధనాన్ని కరెంటు బిల్లుల రూపంలో పెంచి ఆ పెరిగిన ప్రజాధనంతో స్టిక్కర్లను ఇంటింటికి తిరిగి అతికించే దానికి వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వీళ్లకు తోచిన విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజల్లో మార్పు చైతన్యం మొదలైంది. రేపు రాబోయే ఎన్నికల్లో విళ్ళని ప్రజలే తరిమికొడతారని జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నానని బొబ్బేపల్లి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, సాయి శంకర్, శ్రీహరి, రహీం, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.