పంజాబ్ సీఎం కి బెదిరింపు పోస్టర్.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపిన వారికి మిలియన్ డాలర్లు నజరానాగా ఇస్తామంటూ ఓ గోడపై కనిపించిన పోస్టర్ కలకలం రేపింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఓ గోడకు అంటించిన గైడ్ మ్యాప్‌పై ఇలా ప్రచురించారని, దానిపై ఈ-మెయిల్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పోస్టర్ అంటించిన గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబరు 31న ఈ పోస్టర్ అంటించినట్టు మొహాలీ సిటీ ఎస్పీ తెలిపారు. సీటీవీ ఫుటేజీల ఆధారంగా పోస్టర్‌ను ఎవరు అంటించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నామని త్వరలో నిందితులను పట్టుకుంటామని పంజాబ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.