తెలంగాణ ఇంటర్ డిజిటల్ క్లాసుల టైమింగ్స్

తెలంగాణ సర్కార్ (2020-21) విద్యా సంవత్సరాన్నిప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతుల నిర్వహించనున్నట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించగా.. దానికి సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదలైంది.

మార్నింగ్ సెషన్ ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు జరగనుండగా.. మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండనుంది. వారంలో ఆరు రోజులు(సోమ-శని) వరకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ ద్వారా విద్యార్ధులకు తరగతులు బోధించానున్నారు. కాగా, ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి కాలేజీలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.