అంగన్వాడిలకు భోజన సదుపాయాలను సమకూర్చిన తిరుపతి జనసేన

తిరుపతి, రాష్ట్రంలోని అంగన్వాడీలు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే దీనిని పట్టించుకోని వైసిపి పాలకులు వెంటనే వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతిలోని పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన దీక్షలో ఉన్న అంగన్వాడీలకు జనసేన పార్టీ అండగా నిలిచి వారికి భోజన సదుపాయాలను సమకూర్చి, వీరి సమస్యలు తీర్చే వరకు అంగన్వాడి మహిళలతో కలసి పోరాడుతామని తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిన మధుబాబులు వారికి హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దినేష్ జైన్, లక్ష్మి, శిరీష, కొండా రాజమోహన్, మునస్వామి, రాజేష్ ఆచారి, హిమవంత్, హేమంత్, పురుషోత్తం, సాయి, లోహిత్, నవీన్, మధులత, దివ్య, వంశీ, పురుషోత్తం, రమేష్, ఆది, లోకేష్, కృష్ణ, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.