సర్వేలో టాప్.. కీప్ ఇట్ అప్ – అక్కల గాంధీతో నాదెండ్ల మనోహర్

మైలవరం: తెనాలిలోని జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన రావు (గాంధీ) మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా మనోహర్ అక్కల గాంధీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో మీ గురించి ప్రజానాడి తెలుసుకోవటానికి సర్వే నిర్వహించగా, అత్యధిక శాతం ప్రజలు మీకే వోట్ వేశారన్నారు. మైలవరం నియోజకవర్గ స్థానికుడు అవ్వటం, నిత్యం నియోజకవర్గ ప్రజల్లో వుంటూ వారి కష్టాలను, సమస్యలను తెలుసుకుని, ప్రజాసమస్యలపై పోరాడటం లాంటి విషయాలు మీకు కలిసొచ్చాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడాకూడ నిరుత్సాహ పడకుండా మైలవరం నియోజకవర్గం లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకుంటూ వుండమని సూచనలు యిచ్చారు. ఈ భేటీలో మైలవరం నియోజకవర్గ నాయకులు ఏర్రబోలు నరసింహారావు (జి. కొండూరు మండల అధ్యక్షులు), చిట్టేలు హరీష్, రామిశెట్టి ప్రసాద్, జొన్నకూటి శివ కుమార్ పాల్గొన్నారు.