నద్యాలలో అంబేద్కర్ కు ఘననివాళి

నంద్యాల, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం నంద్యాల బొమ్మల సత్రంలో గల అంబేద్కర్ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు చందు, సుందర్ పూలమాలలు వేసి ఘననివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను జనసేన పార్టీ సాధించి తీరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఫక్రుద్దీన్, ఫ్రాన్సిస్, ఫరూక్, చిన్న, నాగరాజు, సుబ్బు, వంశీ తదితరులు పాల్గొన్నారు.