తాడిపత్రి జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

తాడిపత్రి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా తాడిపత్రిలోని ఆర్.డి.టి రూములకు ఎదురుగా ఉన్న స్ధానిక జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతీయుల గుండెల్లో చిరస్మరణీయుడు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ గారు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, హర్షద్అయుబ్, మాదినేని గోపాల్, కొండాశివ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.