Razole: అధికారం కోసం ముద్దుల యాత్ర, ప్రజలు కష్టాల్లో ఉంటే విహంగ యాత్ర: మలికిపురం ఎంపీపీ

రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు లేనంతగా రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తి నష్టం, పశు నష్టం, విలువైన వస్తువులు, వాహనాలు, వ్యవసాయ సామాగ్రి నష్టం తీవ్ర స్థాయిలో జరిగింది. ఇంత విలయతాండవం జరిగిన కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవటం, ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ రెడ్డి మాత్రం అధికారం కోసం ముద్దుల యాత్ర చేసి, ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు హెలికాప్టర్ యాత్ర చేస్తున్నారు. జనసేన నాయకులు, శ్రేణులు నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు భరోసాగా నిలుస్తాం. కానీ వైసీపీ నాయకులు మాత్రం అసెంబ్లీలో కొట్టుకోవటం లో బిజీగా ఉన్నారు. తక్షణమే వరద సహాయ చర్యలు చెప్పటి, రాయలసీమకి వరద సహాయం అందించాలని రాజోలు నియోజకవర్గం మలికిపురం మండల ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.