బొబ్బిలిలో జ్యోతిరావు ఫూలేకు నివాళులు

బొబ్బిలి, భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి జనసేన పార్టీ తరపున ఇవే మా ఘన నివాళులు. బీసీల ఆరాధ్యదైవం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బొబ్బిలి జనసైనికులు నిలయం వద్ద జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ బొబ్బిలి నాయకుల పల్లెం రాజా, రేవల్ల కిరణ్ కుమార్, పోతల శివశంకర్, ఎందువ సత్య, రాజా, అలజంగి సంతోష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.