గుడివాడ జనసైనికుల ఆధ్వర్యంలో మదర్ ధెరిస్సాకు ఘన నివాళులు

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక మున్సిపల్ పార్కు నందు ప్రపంచ శాంతి నోబుల్ బహుమతి అవార్డు గ్రహీత మదర్ ధెరిస్సా 113 వ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ జనసైనికులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే స్ఫూర్తినిచ్చిన మానవతావాది మదర్ ధెరిస్సా జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని, ఎక్కడో దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి ఎంతోమంది పేదవారిని అనారోగ్యంగా ఉన్న వారిని సేవలు చేస్తూ గొప్ప మానవతావాదిగా గుర్తింపబడ్డారని అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలు మన కుటుంబంతో పాటు దేశానికి సమాజానికి కూడా పనిచేయాలని నా ఆకాంక్ష అని తెలియజేశారు. అదేవిధంగా మదర్ ధెరిస్సా జయంతి సందర్భంగా ఆకలితో ఉన్న అన్నార్తులకు ఆహారం అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, చరణ్ తేజ్, నాగసాయి, శివ, చరణ్, ఆర్య మాస్టర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.