బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పోలవరం, కొయ్యలగూడెం జనసేన పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని. విశిష్ట పార్లమెంటేరియన్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కొయ్యలగూడెంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోయిలగూడెం మండల అధ్యక్షులు తోట రవి సీనియర్ నాయకులు దుగ్గిన శ్రీను రెండు జిల్లాల జోనల్ సభ్యులు చోడిపిండి సుబ్రహ్మణ్యం, మేకల సత్య తేజ సరిపల్లి జనసేన పార్టీ సర్పంచ్ తాడేపల్లి గోపి వీరు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు వెళ్లాలనితెలపడం జరిగింది. జనసేన నాయకులు, ఏపూరి సతీష్ కుమార్, గోలిశెట్టి శ్రీనివాస్, చెప్పుల మధుబాబు, మేడిన కన్నయ్య, చవ్వ రాము, నక్క బాబి, మందపాటి రామకృష్ణ, ఈరోతుల వీర్రాజు, ఆమెన్ రాజు, బిల్లూరి కిరణ్, పుప్పాల భార్గవ, గొలిశెట్టి సూరిబాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.