విజయవాడ తూర్పు జనసేన కార్యాలయంలో నేతాజీకి ఘన నివాళులు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.