జనసేన ఆధ్వర్యంలో వీర జవాన్లకు ఘననివాళులు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, పనసనందివాడ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వీర జవాన్ లకు ఘననివాళులు అర్పించారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లో దేశ రక్షణ కొరకు 43 మంది జవాన్లు ప్రాణ త్యాగాలు కోల్పోవడం జరిగింది. వారిని గుర్తు చేసుకుంటూ నేడు బ్లాక్ డే సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసైనికులు నందివాడ గ్రామంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ దేశానికి జవాన్ ఎంత అవసరమో గ్రామానికి యువత అంత అవసరం. అని ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని, నందివాడ గ్రామ యువత, పిల్లలకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, యువత, పెద్దలు, పిల్లలతో పాటుగా పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు జామి అనిల్, దండేల చందు, అనిల్, మౌళి, నందివాడ జనసైనికులు, గ్రామస్థులు పాల్గొన్నారు.