జనసేన ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

అమలాపురం: తెలుగు సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని అమలాపురం జనసేన పార్టీ నాయకులు డి.యం.ఆర్.శేఖర్ ఆధ్వర్యంలో పంచాంగ కర్త శ్రీ ఉపద్రష్ట నాగాదిత్యచే పంచాంగ శ్రవణం జరిగింది. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో రాజకీయంగా పెను మార్పులు జరిగి జనసేన పార్టీ మరియు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ద్వారా మన రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఉందంటూ పంచాంగ కర్త తెలిపారు. అలానే అన్ని రాశుల వారి యొక్క జాతక ఫలితాలను వివరించారు. అనంతరం ప్రముఖ తెలుగు కవులకు సన్మానంలో భాగంగా యస్.కె.బి.ఆర్.కాలేజీ తెలుగు విభాగాధిపతి డా.యస్.ఆర్.యస్.కొల్లూరి పంచాంగకర్త నాగాదిత్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ ప్రాంగణం అయిన నల్లా శ్రీధర్ ఇంటి వద్ద జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.