గురజాల జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు

గురజాల: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశానుసారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో తలపెట్టిన జగనన్న ఇళ్లు – జనాలకు కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం పిడుగురాళ్ల లోని లెనిన్ నగర్ నందు జగనన్న కాలనీ పరిశీలన, మరియు #JaganannaMosam డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిసేలా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. జగనన్న కాలనీల పేరిట మీ పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కేటాయించి సామాన్య ప్రజలకు మాత్రం పనికిరాని కొండలు, గుట్టలలో ఇచ్చారని అన్నారు. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అన్న జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలపై పక్షపాతం చూపిస్తున్నారని అన్నారు. అభివృద్ధి పై నగర ప్రజల మధ్య చర్చకు పెడదామని సవాల్ విసిరారు. 60:40 రాజకీయాలు ప్రజలు గమనించారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఇద్దరికీ బుద్ది చెబుతారన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి కాసిం సైదా మాట్లాడుతూ.. జగనన్న కాలనీల అంటు సామాన్య జనాలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని అన్నారు… మీ కార్యకర్తలకు అన్ని హంగులు ఏర్పాటు చేసిన కాలనిలలో స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తున్నారని ఏమాత్రం పనికి రాని స్థలాలను, ఊరికి సంబంధం లేకుండా ఎక్కడో ఉన్న స్థలాలను ప్రజలకు ఇచ్చి కనీసం శంకుస్థాపన కూడా నోచుకోలేదని, నీ పార్టీ నాయకులకు ఏ విధంగా ఇల్లు కట్టించి ఇచ్చారో అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టించి త్వరగా అందించాలని ఆరోపించారు.. త్వరలో నియోజవర్గంలో జరిగిన అవినీతిపై పూర్తి ఆధారాలతో చర్చకు వస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, పెడకోలిమి కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గుర్రం కోటేశ్వరరావు, ఆవుల రమేష్, కార్యదర్సులు, షేక్ గఫూర్, బేతంచర్ల నాగేశ్వరరావు, బేతంచర్ల ప్రసాద్, జన సైనికులు సుంకర శ్రీనివాసరావు, కామిశెట్టి అశోక్, కామిశెట్టి ఆదిత్య, నరేష్, అభి, మంగారావు, అనంతు, పవన్, వాసు, ఆనంద్, మొదలగు వారు పాల్గొన్నారు.