జనసేన ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

నెల్లూరు: నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను త్యాగం చేశారని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు సుజయ్ బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామి రెడ్డి, జిల్లా కార్యదర్శి అలియా, నగర ప్రధాన కార్యదర్శి కంతర్, నగర కార్యదర్శి జీవన్, డివిజన్ ఇంచార్జిలో పవన్ అజయ్, అలేఖ్య వివిధ డివిజన్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.