చెర్రీ కోసం మారేడుమిల్లికి ఉపాసన!

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం `ఆచార్య` షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ కామ్రేడ్ సిద్ధగా కనిపించనున్నాడు. తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కోసం చెర్రీ చాలా రోజుల క్రితమే మారేడుమిల్లి చేరుకున్నాడు.

తాజాగా చెర్రీ భార్య ఉపాసన కూడా మారేడుమిల్లి వెళ్లారు. రాజమండ్రి విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఉపాసన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి, చెర్రీ కలిసి నటిస్తుండడాన్ని స్వయంగా చూసేందుకు ఉపాసన `ఆచార్య` సెట్‌కు వెళుతున్నారట. కాగా, ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ కనిపించబోతోంది. చెర్రీ సరసన కనిపించబోయే కథానాయిక గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.