‘వాక్సినేషన్ సెంచరీ’ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్
భారత్లో శతకోటి డోసుల వ్యాక్సిన్ డోసులను వినియోగించిన విషయం తెలిసిందే. మొన్నటితో భారత్ ఈ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు వేసిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,01,30,28,411కు చేరింది. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోన్న నేపథ్యంలో దీనిపై సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశాడు. భారత్ విజయవంతంగా 100 డోసుల వ్యాక్సిన్ వినియోగాన్ని పూర్తి చేసుకుందని గుర్తు చేశాడు. భారత్ ఈ ఘనత సాధించడానికి పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వైద్య బృందాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెర్రీ చెప్పాడు. కాగా, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. చెర్రీ హీరోగా శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా రూపొందుతోంది.
India has successfully administered 100 crore vaccinations to score a #VaccineCentury
— Ram Charan (@AlwaysRamCharan) October 23, 2021
I salute our frontline medical teams who helped achieve this historic feat. @MoHFW_INDIA