సెప్టెంబర్ నాటికి చిన్నారులకు అందుబాటులోకి వ్యాక్సిన్..

కరోనా మహమ్మారికి చెక్‌ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్‌ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే పిల్లలపై కోవాగ్జిన్‌ చేపట్టిన రెండు, మూడో దశ ట్రయల్స్‌కు సంబంధించిన డేటా సెప్టెంబర్‌లో అందుబాటులోకి వస్తుందని.. అదే నెలలో వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు గులేరియా.. అంతేకాదు.. ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు భారత్‌లో అనుమతి ఇస్తే.. అవి కూడా పిల్లలకు అందించే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.