శింగనమల జనసేన ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

శింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గల వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని శింగనమల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహనీయునికి ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు బొమ్మన పురుషోత్తమ రెడ్డి, దేవరకొండ జయమ్మ, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ ఎర్రిస్వామి మండల నాయకులు కమల్, మునీంద్ర, వీరమహిళలు మంజుల, హరిత, అనసూయ తదితరులు పాల్గొన్నారు.