జనసేన ఉత్తరాంధ్ర వీరమహిళల ఆత్మీయ సమావేశం

విశాఖపట్టణంలోని ముడసర్లోవా పార్కు నందు జనసేన ఉత్తరాంధ్ర మహిళా కో-ఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో 325 మంది ఉత్తరాంధ్ర వీరమహిళలకు వన సమారాదన విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్రా జిల్లాల వీరమహిళలతో యువ శక్తి పోస్టర్ ఆవిష్కరణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, ఏర్పాటు చేయడం జరిగింది.