వారాహి యాత్ర విజయవంతంగా సాగాలి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి నియోజకవర్గం: మనుబోలు మండలం నందు మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు 108 కొబ్బరికాయలు కొట్టి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ.. జూన్ 14న ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగే వారాహి యాత్ర విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో 108 కొబ్బరికాయలు కొట్టి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంజనీ పుత్రుడు వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ వారాహి మాత అనుగ్రహంతో రాబోయే రోజుల్లో రామరాజ్యం రావాలని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం రెండు రోజుల నుంచి ఆయన చేస్తున్న యాగం వారహిపై ఆయన కొనసాగబోయే యాత్రలో భాగంగా అనేక అంశాలని ప్రజలకు తెలియజేసే విధంగా మొదటి విడత ఈ యాత్ర తొమ్మిది రోజులపాటు కొనసాగుతుంది. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం ఆయన ఉద్దేశం. అందుకు కట్టుబడి మేమంతా కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధం ప్రజలందరూ ఒక్క క్షణం ఆలోచించండి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జాకిర్, సందీప్, శ్రీకాంత్, నహిం, సుధాకర్, శీనయ్య, వెంకయ్య, పిన్నిశేట్టి మల్లికార్జున్, శ్రీహరి, కోటి తదితరులు పాల్గొన్నారు.