యడ్ల మహేష్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి అధ్యక్షులు కందుల దుర్గేష్ ముఖ్య అనుచరుడు నిస్వార్ధ జనసైనికుడు యడ్ల మహేష్ పుట్టినరోజు సందర్భంగా.. స్థానిక ధవళేశ్వరం కుమ్మర వీధి నందు నివసిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తోటా ప్రసాద్ కుటుంబానికి 10,000 రూపాయలుం ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు స్థానిక పారిశుధ్య కార్మికులకు స్వెట్టర్లు.. 100 మంది అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్బంగా యడ్ల మహేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ అడుగుజాడల్లో అట్టహాసాలకు దూరంగా.. సేవా స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు తోడు నిలిచిన జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.