సెన్సార్ పూర్తి చేసుకున్న వరుడు నాగ శౌర్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా అక్టోబర్ 29 వ తేదీన విడుదల కాబోతుంది.

నిజానికి నవంబర్ లో విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వలన ముందుగా రిలీజ్ అవుతుంది. కాగా తాజా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా…. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రానా దగ్గుపాటి ఈ రోజు సాయంత్రం 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.