సర్వేపల్లి జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన వెలగపూడి వరప్రసాద్

సర్వేపల్లి, మాజీ తిరుపతి పార్లమెంటు ఎంపీ మరియు గూడూరు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన వెలగపూడి వరప్రసాద్ తిరుపతి పార్లమెంటు ఎంపీగా జనసేన-తెలుగుదేశం-బిజెపి బలపరిచిన అభ్యర్థిగా జరగబోయే ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతుంది, అందులో భాగంగా గురువారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని స్వగృహానికి వెళ్ళి గౌరవప్రదంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సామాన్యులతో నేను, నాతో సామాన్యులు అనేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి వరప్రసాద్ గెలుపు కోసం సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మా వంతు మేము బలంగా పనిచేసే ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల మండల అధ్యక్షులతో త్వరలోనే ఎంపీ అభ్యర్థిని కలిసి ఐదు మండలాల్లో కూడా ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకునే దానికి కృషి చేసే విధంగా అడుగులు ముందుకు వేస్తాం. వెలగపూడి వరప్రసాద్ తో పాటు బిజెపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు సిపా రెడ్డి వంశిధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి పాల్గొన్నారు.