లక్ష్మీదేవిపల్లి మండలంలో పర్యటించిన వేముల కార్తిక్
కొత్తగూడెం నియోజకవర్గం: లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంత్ నగర్ కాలనీ, లోతువాగు గ్రామాల్లో జనసేన కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జి వేముల కార్తిక్ పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రజలు సైడ్ కాల్వలు లేక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు చెప్పారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి సరైన సైడ్ కాల్వలు నిర్మించవలసిందిగా జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నామని వేముల కార్తిక్ తెలిపరు. అదేవిధంగా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొత్తగూడెంలో జనసేన పోటీ చేస్తునందున్న జనసేనకి ఓట్ వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా, సెక్రటరీ సాయి అనిత్, పాల్వంచ మండలం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సంపత్ రామ్ వర్మ, అది నాగ సాయి హర్షవర్ధన్, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-07-at-4.14.18-PM.jpeg)