అంబేడ్కర్‌కు ఉపరాష్ట్రపతి ఘన నివాళి

న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి.. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు.

ప్రతి పౌరుడికీ సాధికారత కలగడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి చివరి వరకు అదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ అని వెంకయ్యనాయుడు కొనియాడారు. వారి బోధనలను, సూచించిన మార్గాన్ని యువత అనుసరించి.. వివక్షకు తావులేని భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.