బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ పేరు విజయవాడకి పెట్టాలి – వర్దినేని దుర్గా శ్రీనివాస్

వంగవీటి మోహన రంగ నామకరణం విజయవాడకి చెయ్యాలి అని జనసేన బాలాజీనగర్ 115 డివిజన్ ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్ డిమాండ్ చేసారు…కులం, మతం, వర్గం, ప్రాంతంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అందరివాడిగా కీర్తి పొందిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగ, రాజకీయ నాయకుడు కాదు ప్రజనాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం అని అన్నారు. పేదల ఇల్లు కోసం నిరాహారదీక్ష చేస్తూ ఉండగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేశారు అని గుర్తు చేశారు అనేక మందికి సేవ చెయ్యటం ఇప్పుడు ఉన్న చాలా మంది నాయకులకు రంగ పెట్టిన రాజకీయా భిక్ష అని ప్రజలకోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావులకి మనం ఇచ్చే మర్యాద ఇదేనా అని ఆయన గట్టిగా ప్రశ్నించారు వంగవీటి మోహన రంగ నామకరణం చెయ్యకపోతే ఆంధ్రప్రదేశ్ లో మరో ఉద్యమం తప్పదు అని ఆయన పేర్కొన్నారు.