జనసేన, టీడీపీల గ్రామ గ్రామన గ్రామస్థాయి సమావేశాలు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో బుధవారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, గ్రామశాఖ అధ్యక్షులు మండేలా బాబీ నాయుడు ఆధ్వర్యంలో జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, జనసేన -టిడిపి సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు, టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ, జిల్లా సంయుక్త కార్యదర్శి తాతాజీ, ఎంపీటీసీ ఉండపల్లి అంజి, మోహన్ మాస్టర్, రక్షక్, టీడీపీ మండల అధ్యక్షులు ముప్పర్తి నాని ప్రసాద్, టీడీపీ గ్రామాశాఖ అధ్యక్షులు చెవ్వకుల సత్యనారాయణ, యెనుముల సత్యనారాయణ, యానుముల తాతాజీ, మురళి, జనసేన-టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.