వారాహి యాత్ర విజయవంతం కావాలని శ్రీశ్రీశ్రీ కోట దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జూన్ 14న ప్రారంభించబోయే వారాహి యాత్ర దిగ్విజయంగా సాగాలని, ఏ విధమైన ఆటంకాలు, అడ్డంకులు జరగకుండా ఉండాలని వైసీపీ దుష్టశక్తి పాలన పోవాలని, ప్రజలకు మళ్లీ రామరాజ్యం లాంటి రాజ్యాధికార పాలన వచ్చే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని, ఆదివారం పాలకొండ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ కోట దుర్గ అమ్మవారి ఆలయంలో వారాహి యాత్ర పోస్టర్లు ఆవిష్కరించి, కోట దుర్గమ్మ తల్లి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారిపై రక్షణగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపించి, 108 టెంకాయలు వారాహి యాత్రకు ఉండే దిష్టి పోయే విధంగా జై జనసేన నినాదాలతో జనసైనికులు మధ్య 108 టెంకాయలు సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు జల్లు సోంబాబు, ప్రశాంత్, రమేష్, అనిల్, రమేష్, గోవిందరావు, చిన్న రాయుడు, గణేష్, రాజేష్, వేణు, ప్రసాద్, ప్రేమ్ కుమార్, లోకేష్, ఉమా, దుర్గ, ప్రసాద్, భాస్కర్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.