పెంటపాడు గ్రామంలో పల్లెపోరు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం, పెంటపాడు మండలం, పెంటపాడు గ్రామంలో జనసేన – తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఐదవ రోజు పల్లెపోరులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఇంచార్జ్ వలవల బాబ్జి, భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ ఈతకోట తాతాజీ మరియు నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ, బిజెపి పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.