విశాఖ: సింహాద్రి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద జనసేన నిరసన

విశాఖపట్నం: విశాఖ ఎలమంచిలిలో సింహాద్రి బార్ అండ్ రెస్టారెంట్ వద్ద జనసేన ఉత్తరాంధ్ర ఇంచార్జ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు బినామీ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్‌లో 24 గంటల పాటు మందు అమ్మకాలు చేపడుతున్నారని.. తెల్లవారుజామున జనసేన నాయకులు స్వయంగా వెళ్లి మందు కొనుగోలు చేసి పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బార్ అండ్ రెస్టారెంట్ ఆదాయం పెంచేందుకు, ప్రభుత్వ వైన్ షాపులు గంట ముందే ఎలమంచిలిలో మూసి వేస్తున్నారని జనసేన నాయకులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *