వరద బాధితులను అండగా వి.ఆర్.పురం జనసేన

వి.ఆర్.పురం మండలం జనసేన పార్టీ తరఫున శనివారం వరద ముంపు బాధితులైన గర్భిణీ స్త్రీలకు, పిల్లతల్లులకు మరియు వృద్ధులకు ఫ్రూట్స్, బ్రెడ్, మిల్క్ మరియు బిస్కెట్స్ తో కూడిన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి జనసైనికుడికి ధన్యవాదములు తెలియజేశారు. పార్టీ తరపున ప్రతి పంచాయతీలో ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.