మేడారం భక్తుల సేవలో వరంగల్ జనసేన

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి ఆకుల సుమన్ ఆదేశాలతో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మేడారం జాతర సందర్భంగా రెండవ రోజు వరంగల్ జనసేన పార్టీ అధ్వర్యంలో జిల్లా నాయకులు గోళ్ళ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండ్ ఆవరణలో గురువారం మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులకు దాహార్తిని తీర్చేందుకు వాటర్ బాటిళ్ళను అందిస్తూ మరియు కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని మాస్క్ లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఆర్.టి.శి కార్మికులకి, మెడికల్ సిబ్బంది, పోలీస్ వారికి వాటర్ బాటిల్స్ మరియు మాస్క్ లను అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వరంగల్ జిల్లా నాయకులు గోళ్ళ రాజేంద్ర ప్రసాద్, గడ్డం రాకేష్, మేరుగు శివ కోటీ, గాదె పృధ్వీ, ముక్క అభిలాష్, మేకల ప్రసన్న కుమార్, కొల్లూరి అనుదీప్, నమీఒడ్ల వంశీ, దయాకర్, శివాజి తదితరులు పాల్గొన్నారు.