వనపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ సత్తా చూపిస్తాం

  • వనపర్తి నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ ముకుంద నాయుడు

తెలంగాణ, వనపర్తి నియోజకవర్గం: జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల రూపంలో బలంగా జనసేన పార్టీ సత్తా చూపనున్నాం అని వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు. వనపర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నియోజకర్గ నాయకుల సమావేశంలో ముకుంద నాయుడు మాట్లాడుతూ వనపర్తి అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో గత ఏడాది నుంచి పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు వెళ్తూ గ్రామ స్థాయిలో నికార్సైన జనసేన నాయకులని, జనసైనికులను తయారు చేసుకున్నాము అని ప్రజల్లో కూడా జనసేన సిద్దాంతాలు, ఆశయాల గురించి అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. పార్టీ వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసేలా అన్ని రకాలుగా శక్తి మేరకు అహర్నిశలు శ్రమిస్తున్నాం అని ఈ ఎన్నికల్లో పార్టీ స్వయంగా పోటీలో వున్నా, పొత్తులో భాగంగా ఏ పార్టీతో పోటీలోకి దిగినా గెలుపే లక్ష్యంగా కార్యచరణ రూపొందించామని తెలిపారు. మొత్తానికి ఈ ఎలక్షన్ లో జనసేన పార్టీ బలమైన ఓటు బ్యాంక్ గల పార్టీగా గుర్తింపు పొందబోతుంది ప్రధాన పార్టీలకు ధీటుగా నిలవబోతుంది అని జన సైనికులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ ముకుంద నాయుడు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు జి. బాలక్రిష్ణ మరియు సురేష్ యాదవ్, మచ్చ ఉత్తేజ్, రవి కుమార్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.