కేతిరెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం

ధర్మవరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పతనం మొదలైందని తల్లిని, చెల్లిని ఉద్దరించలేని జగన్మోహన్ రెడ్డి రాష్ర్టంలో ఉన్న మహిళలను ఎలా ఉద్ధరించగలడంటూ మొదట మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాకుండా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మారిస్తే సరిపోతుంది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని ధర్మవరంలో ఉన్న వ్యతిరేక ఓటును కూడా చీలనివ్వనని కేతిరెడ్డి వ్యతిరేకులను, ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి కేతిరెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామంటూ పేర్కొన్నారు.