పంచాయతీల నిధులెక్కడ?: పితాని బాలకృష్ణ

  • జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన అమలాపురం కలెక్టరేట్ వద్ద వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ .

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సూచనల మేరకు గురువారం బీజేపీ తలపెట్టిన కేంద్రప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళిస్తున్నందున ఈ విషయంపై బీజేపీ అధ్యక్షులు పురందరేశ్వరి కోరిన మేరకు జనసేన అధ్యక్షులు కొణెదల పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడంతో ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరితో కలిసి అమలాపురం కలెక్టరేట్ వద్ద వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 114వ 15వ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లింపుపై తీవ్రంగా విమర్శించారు. ఒక్క పంచాయతీలే కాకుండా ప్రతీ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఈయనేనని మండిపడడం జరిగింది. సర్పంచ్ లు అందరికి మేము అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా జనసేన నాయకులు, రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.