జనసేనాని నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజాప్రయోజనాలు దృష్ట్యా ఆయన రాజకీయ షణ్ముఖ వ్యూహంలో ఆయన మాటని సిరసావహిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసే దానికి మా వంతు మేం కృషి చేస్తామని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. రామాయణంలో మహాతల్లి సీతాదేవి లక్ష్మణుడు గీసిన గీత మాయావి అయిన రావణాసురుడి మాటలకి గీత దాటిందేమో గాని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గీత మేము దాటం. ఆయన మాటని శిరసా వహిస్తామని చెప్పి మనస్పూర్తిగా తెలియజేస్తున్నామని సురేష్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, నవీన్, రహీం, అక్బర్, చిన్నా, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.