జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా పని చేస్తా..!: సోనియా అప్పలస్వామి

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని, పార్టీ నాపై నమ్మకముంచి, నన్ను గుర్తించి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులుగా బాధ్యత అప్పజెప్పిన సందర్భంగా పార్టీకి మనస్ఫూర్తిగా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నానని నూతనంగా ఎన్నికైన సోనియా అప్పలస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గా చేయాలని లక్ష్యంతో, జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంతో, జనసేన పార్టీ సిద్ధాంతాలు విధివిధానాలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్ళి పార్టీ నిర్మాణాలు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నియోజకవర్గంలోగల ఆరు మండలాల్లో ప్రతి పంచాయతీ గ్రామాలలో సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. సమస్యలను వెలికి తీస్తూ.. ఆయా సమస్యల పరిష్కారం కోసం అందరి సహకారంతో ఎనలేని పోరాటం చేసేందుకై.. సమస్యలను పరిష్కరించేంత వరకూ నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామని సోనియా అప్పలస్వామి తెలిపారు.