శ్రీకాళహస్తి ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించండి!

  • జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శుక్రవారం తొట్టంబేడు మండలం, కన్నలి ఎస్సీ కాలనీ, కన్నలి ఎస్టీ కాలనీ , కొత్త కన్నలి లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, పార్లమెంట్ ఎంపీ స్థానానికి బీజేపీ వరప్రసాద్ కి కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉమ్మడి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ గారు , నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది.