కళ్యాణదుర్గంలో మహిళా శక్తి

కళ్యాణదుర్గం, జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల కోసం అందించే పథకాలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వివరించే ప్రణాళికలో భాగంగా మహిళా శక్తి కార్యక్రమాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి నుండి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిడిపి ప్రొఫెషనల్ అధ్యక్షురాలు తేజస్విని హాజరవగా, జనసేన పార్టీ నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గం వీర మహిళల ఇంచార్జ్ షేక్ తార, కళ్యాణదుర్గం మండల వీర మహిళల ఇంచార్జ్ మమత, కళ్యాణదుర్గం టౌన్ వీర మహిళల ఇంచార్జ్ కల్పన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి వీరమహిళలు, ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.