మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాలు రామయ్య

రాజంపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ పార్వతీపురం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. సమాజంలో మహిళ ఎంతో కీలకమని మహిళా శక్తి వెలకట్టలేనిదని మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి రాణిస్తున్నారన్నారు. ఏ ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలని ఆయన తెలియజేశారు.