జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం: మహిళా దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యాలయంలో ఇంఛార్జి డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీరమహిళ విభాగాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో స్త్రీ పురుష భేదం లేకుండా మహిళలు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు అందిపుచ్చుకుంటూ దేశం అభివృద్ది సాధించటంలో వారి పాత్ర చాలా కీలకం అని తెలియ చేశారు. గత కాలంనాటి సాంఘీక అసమానతలను దైర్యంగా ఎదుర్కొని మహిళలు నేటి రాజకీయాలలో ఇంకా ఎంతో అభివద్ధి సాధించాలని తెలియచేశారు. మహిళలు చదువుకొని అభివృద్దిపథంలో అన్ని రంగాలలో పురోగమించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీరమహిళలు, నాయకులు పాల్గొన్నారు.