మాడుగులలో 29 పంచాయతీల జనసైనికులతో సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడానికి మండలంలో ఉన్న 29పంచాయితీ లలో ముఖ్య జనసైనికులు సమావేశం ఆదివారం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకున్నారు, ప్రతి పంచాయితిలో, ప్రతి గ్రామంలో జనసేనా బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి మరియు అధికార పార్టీ వైఫల్యాలు ప్రజలకు వివరిస్తూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళాలి, పార్టీ ఆదేశాలు మేరకు మార్చి నెలాఖరు నాటికి మండల మరియు గ్రామ కమిటీలు నియమించనున్నట్టు జనసైనికులు తెలిపారు మాడుగుల జనసైనికులు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు.